ఇంజనీరింగ్‌ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌

జేఎన్‌టీయూ (కాకినాడ, అనంతపురం) ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని ఇంజనీరింగ్ విద్యార్థులకు ఆన్‌లైన్‌లో ఉచితంగా గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) కోచింగ్ ఇవ్వనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఈ మేరకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్ని యూనివర్సిటీల వీసీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.



  • తాజాగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి, జేఎన్‌టీయూ (అనంతపురం) జేఎన్‌టీయూ(కాకినాడ) యోగి వేమన విశ్వవిద్యాలయం (కడప) ఆధ్వర్యంలో గేట్‌కు ఆన్‌లైన్ కోచింగ్ ఇవ్వనున్నారు.

  • రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో 3,4వ సంవత్సరాల విద్యార్థులకు అనుభవజ్ఞులు, నిపుణులతో ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తారు.

  • గేట్ పరీక్షలకు సంబంధించిన ప్రతి సబ్జెక్టును 12 సెషన్లలో 12 రోజుల పాటు బోధిస్తారు. ఒక్కో సెషన్ రెండు గంటల సేపు ఉంటుంది.

  • రోజుకు రెండు సబ్జెక్టుల చొప్పున, ఇద్దరు చొప్పున వేర్వేరు ఫ్యాకల్టీ బోధిస్తారు.